శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (19:05 IST)

నీ మొగుడు.. నేను ఉండగా.. మరొకడు కావాలా? వివాహితకు కత్తిపోట్లు

భర్త ఉండగా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత కత్తిపోట్లకు గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగలూరు సమీపంలో ఉన్న బెళత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెళత్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్‌ (28) అనే వ్యక్తి భార్య మంజుల. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈమెకు చూడాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజశేఖర్‌ (35)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ నేపథ్యంలో బాగలూరు కోట ప్రాంతానికి చెందిన సురేశ్‌తో మంజులకు పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో పదేపదే అతనితో మాట్లాడుతూ, కలుస్తూ వచ్చింది. దీన్ని సహించలేదని రాజశేఖర్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఆవేశం చెందిన అతడు ఆమెపై కత్తితో దాడి పారిపోయాడు.
 
ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడిని గుర్తించి అరెస్టు చేశారు.