శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 8 అక్టోబరు 2014 (18:41 IST)

యాహూ రెండు వేల మంది ఉద్యోగులను పంపిస్తుందా ...?

యాహూ సంస్థ తన బెంగళూరు కార్యాలయంలో సమూల 'మార్పు'లకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు మెరుగైన సేవలందించడం కోసమే అని చెపుతున్నప్పటికీ ఉద్యోగులను ఊడబెరికే కార్యక్రమం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ చెపుతున్నప్పటికీ సంస్థలో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేమన్నారు.
 
కానీ యాహూ బెంగళూరు క్యాంపస్ లోని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లో 2500 మందికి పైగా ఉన్న ఉద్యోగుల్లో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరి అదే నిజమైతే వారంతా రోడ్డున పడుతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.