శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:42 IST)

ప్రతీ శనివారం నాడు ఇలా చేస్తే..?

ఆంజనేయ స్వామిని ఎప్పుడు, ఎలా పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాలి. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్న మూర్తి హనుమంతుడు. అలాంటి ఆంజనేయుడిని ప్రతిరోజూ పూజిస్తే శుభ ఫలితాలుంటాయి. అలానే వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుడిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
హనుమంతుడిని పూజించడానికి స్వామివారి పటం ఎంచుకోండి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికండ అవసరం. శనివారం రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి.
 
హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో ఉంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు, బియ్యం సమర్పించి పూజ చేయాలి. ఇకపోతే.. హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై సిందూరం పెట్టుకునే సంగతిని ఆరాతీయగా, శ్రీరాముడి అనుగ్రహం కోసమని సమాధానమిచ్చిందని, శ్రీరాముడి కోసం హనుమంతుడు శరీరం అంతా సిందూరం అద్దుకున్నాడని చెప్తారు.
 
అనేకమంది భక్తులు బ్రాహ్మణులకు సిందూరం దానం చేస్తారు. హనుమంతుడిని పూజించేటప్పుడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. శనివారం రోజున మిఠాయిలను నైవేద్యం పెడితే శుభం కలుగుతుందని విశ్వాసం.