శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 9 జులై 2018 (12:38 IST)

ఆపదనలను తొలగించే ఆదిదేవుడు....

పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో కీతవారి గూడెం ఒకటి. ఇది స

పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో కీతవారి గూడెం ఒకటి. ఇది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో దర్శనమిస్తారు. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు.
 
ఆపదలో ఉన్నవాళ్లు ఆ స్వామిని మనస్సులో తలచుకున్నంతనే బయటపడతారని చెప్పుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఒక వైపున శివుడు మరో వైపున హనుమంతుడు రూపం కలిగిన ఒకే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షా కాలంలో ఈ ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది.
 
ఈ రెండు ఆలయాలు కూడా ప్రశాంతతకు పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. భక్తుల అంకితభావానికి అద్దం పడుతుంటాయి. రహదారి పక్కనే ఉండడం వలన అటుగా వెళ్లే వాళ్లు వచ్చే వాళ్లు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.