జాతికోసం ఆడితేనే నిధులు: క్రీడాశాఖ ప్రకటన
జాతీకోసం ఆడకుండా తప్పించుకునే క్రీడాకారులపై క్రీడాశాఖ కన్నెర్రచేసింది. అవరసరమైనప్పుడు వివిధ టోర్నమెంట్లలో భారత్ నుంచి ఆడకుండా వైదొలగే క్రీడాకారులకు నిధులు అందకుండా చూడాలని క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది.
భారత టెన్నిస్ టాప్ ఆటగాళ్లయిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్దేవ్ దేవ్వర్మన్లు తమ ర్యాంకింగ్ పాయింట్ల కోసం ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. సానియా మీర్జా మినహా మిగతా టాప్ ప్లేయర్లంతా దూరమవడంతో ఆ మెగా ఈవెంట్కు భారత్ నుంచి ద్వితీయశ్రేణి టెన్నిస్ జట్టును పంపాల్సి వచ్చింది.
దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన క్రీడాశాఖ.. కేంద్రంనుంచి ఆర్ధికతోడ్పాటు అందుకోవాలంటే, అవసరమైనప్పుడు జాతీయజట్టుకు అందుబాటులో ఉండాలని ఆటగాళ్లకు అల్టిమేటం జారీచేసింది.