శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (17:52 IST)

సాయ్ పాలక మండలి సభ్యురాలిగా గుత్తా జ్వాల.. ఖుషీ ఖుషీగా ఢిల్లీకి..

2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌‌లో రజతంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల దేశం తరఫున ఒలింపిక్స్‌లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ

2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌‌లో రజతంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల దేశం తరఫున ఒలింపిక్స్‌లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) పాలక మండలి సభ్యురాలిగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల నియమితురాలయ్యారు. 
 
దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం గుత్తా జ్వాలను ఎస్ఏఐ పాలక మండలి సభ్యురాలిగా నియమించినట్లు సాయ్ కార్యదర్శి ఎస్.ఎస్ ఛాబ్రా తెలిపారు. డబుల్స్ విభాగంలో 14సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన జ్వాలకు ఈ గౌరవం దక్కడం హర్షనీయమని ఛాబ్రా వెల్లడించారు. 
 
ఎస్ఏఐ పాలకమండలి సభ్యురాలిగా ఎంపికవడంపై జ్వాల మాట్లాడుతూ.. తనకు రెండు రోజుల క్రితం సాయ్ అధికారులు ఈ నిర్ణయాన్ని ఫోన్ ద్వారా తెలిపారన్నారు. సాయ్‌లో తన విధులు, బాధ్యతలు ఇంకా స్పష్టం కానప్పటికీ ఈ నెల 28 వ తేదీన ఢిల్లీలో ‘సాయ్‌’తో తన మొదటి సమావేశం ఉంటుందని వివరించారు. దేశంలో బ్యాడ్మింటన్‌ రంగం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.