శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (16:03 IST)

వరుసగా 14 విజయాలు: పోర్షేలో సానియా జోడీకి షాక్!

భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు షాక్ తగిలింది. సానియా మీర్జా జోడీకి 14 వరుస విజయాల తర్వాత బ్రేక్ పడింది. స్టట్ గార్ట్‌లో జరుగుతున్న పోర్షే గ్రాండ్ ప్రీలో సానియా జోడీ తొలి రౌండ్లోనే ఖంగుతింది. పెట్రా మార్టిస్, స్టెఫానీ వోట్ ద్వయం 6-3, 6-3తో వరుస సెట్లలో సానియా జోడీని చిత్తు చేసింది. ప్రత్యర్థి జోడీపై మెరుగ్గా ఆడినప్పటికీ.. సానియా జోడీ వరుస సెట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. 
 
ఇకపోతే.. ఇండియన్ వెల్స్, మియామి, చార్లెస్టన్ ఓపెన్ టోర్నీల్లో జయకేతనం ఎగురవేసిన సానియా, హింగిస్ జోడీలకు ఈ ఓటమితో షాక్ తింది. సానియా-హింగిస్ మహిళల డబుల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ జోడీ కాగా, తాజా ఓటమితో తమ ర్యాంకును ప్రమాదంలో పడేసుకున్నారు. మాటెక్ సాండ్స్, సఫరోవా జోడీ గనుక పోర్షే గ్రాండ్ ప్రీలో టైటిల్ నెగ్గితే సానియా జోడీని వెనక్కినెట్టి అగ్రపీఠం అధిష్ఠిస్తారు.