కేసీఆర్తో సానియా మీర్జా భేటీ : డబ్ల్యూటీఏ టైటిల్తో హ్యాపీ!
తెలంగాణ సీఎం కేసీఆర్ను ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్యాంప్ ఆఫీసులో కలిశారు. సానియా డబ్ల్యూటీఏను గెలుచుకున్న నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన సానియా కేసీఆర్తో భేటీ అయ్యారు.
సానియా తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ పెదరర్ జట్టులో తాను కూడా ఉండడం ఎంతో థ్రిల్లింగ్గా ఉందని వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ఐపీటీఎల్లో ఆడడం భారత్ లాంటి దేశాల్లో టెన్నిస్ అభివృద్ధికి దోహదపడుతుందని బుధవారం చెప్పారు. ఐపీటీఎల్ తప్పకుండా సక్సెస్ అవుతుందని సానియా మీర్జా వెల్లడించారు.
కాగా వచ్చే నెల ఆరంభంకానున్న ఐపీటీఎల్లో భారత్తో కలిపి మొత్తం నాలుగు ప్రాంఛైజీలున్నాయి. ఈ టోర్నీలో ఫెడరర్, జొకోవిచ్, ఆండీ మర్రే, పీట్ సంప్రాస్ లాంటి ఆటగాళ్లు ఆడనున్నారు.