శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 28 సెప్టెంబరు 2014 (14:30 IST)

ఆసియా క్రీడలు : చిత్తుగా ఓడిన సానియా మీర్జా జోడీ!

ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగం పోటీల్లో సానియా మీర్జా, ప్రార్థన జోడీ సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ చిన్ వీ చాన్, సు వీ సీహ్ చేతిలో సానియా జోడీ 7-6, 2-6, 4-10 స్కోరుతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో సానియా జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది. 
 
ఆర్చరీలో భారత్‌కు ఆదివారం నిరాశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రికర్వ్ అంశంలో కాంస్యం కోసం పోరులో భారత అమ్మాయిల బృందం జపాన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 30 పతకాలు (3 స్వర్ణ, 5 రజత, 22 కాంస్య) ఉండగా, ఓవరాల్ స్టాండింగ్స్ లో భారత్ 12వ స్థానంలో ఉంది. చైనా, దక్షిణకొరియా, జపాన్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా ఖాతాలో 101 పసిడి పతకాలు ఉండగా, దక్షిణకొరియా 40, జపాన్ 32 స్వర్ణాలు ఖాతాలో ఉన్నాయి.