శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (16:13 IST)

బాయ్‌పై గుత్తా జ్వాల ఫైర్: డబుల్స్ ఆటగాళ్లపై సవతి ప్రేమ ఎన్నాళ్ళు!?

హైదరాబాదీ స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్)పై ఫైర్ అయ్యింది. డబుల్స్ ఆటగాళ్లపై బాయ్ సవతి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టింది. ఇప్పటికైనా వైఖరిని మార్చుకోవాలని జ్వాలా గుత్తా సూచించింది. డబుల్స్ క్రీడాకారిణిగా తాను అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఎన్నో పతకాలు సాధించినా.. డబుల్స్ విభాగాన్ని బాయ్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పింది. 
 
బ్యాడ్మింటన్‌లో సింగిల్ షట్లర్లకు ఇస్తున్న ప్రాధాన్యతలో కొంతైనా డబుల్స్ షట్లర్లకు ఇవ్వడం లేదని జ్వాలా గుత్తా వెల్లడించింది. డబుల్స్ క్రీడాకారిణిలపై ఎన్నాళ్లీ సవతితల్లి ప్రేమ చూపిస్తారు? మీ పద్దతి మార్చుకోవాల్సిన అవసరముందని దక్షిణాసియా క్రీడల్లో ఆడుతున్న జ్వాలా గుత్తా బాయ్‌పై ఫైర్ అయ్యింది. డబుల్స్ విభాగంలో అశ్వినీ, నేను మినహా ఎవ్వరూ లేరన్నారు. చైనాలో అయితే కనీసం ఆరుగురు మహిళలు, పురుషుల మిక్స్‌డ్ డబుల్స్ జంటలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.