శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (18:18 IST)

తెలంగాణ నుంచి ఆడేందుకు ఇంకా బతికే వున్నాం! : గుత్తా జ్వాల

తెలంగాణ నుంచి జాతీయ క్రీడల్లో ఆడటానికి తామింకా బతికే వున్నామని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. నేషనల్ గేమ్స్‌కి తెలంగాణ నుంచి ఒక బెంగాలీ యువతిని పంపిస్తున్నారని, ఈ విషయం మీద ఎవరూ మాట్లాడకపోయినా... తెలంగాణ నుంచి జాతీయ క్రీడల్లో ఆడటానికి తామింకా బతికే వున్నామని గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. 
 
ఈ ట్విట్ క్రీడా వర్గాల్లో మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కూడా సంచలనం రేపింది. తెలంగాణలో అనేకమంది క్రీడాకారిణులు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క సానియా మీర్జాకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని జ్వాలా ఫైర్ అవుతున్నట్లు సమాచారం. 
 
అంతేగాకుండా గతంలో సైనా నెహ్వాల్ పద్మ అవార్డుకు తన పేరును రెకమండ్ చేయలేదని వాపోయిన సందర్భంగా.. గుత్తా స్పందిస్తూ అవార్డులను అడిగి తెచ్చుకోవడం ఎందుకు అర్హత వుంటే వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.