శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (11:02 IST)

వింబుల్డన్ టోర్నీ: అక్క వీనస్‌ విలియమ్స్‌‍పై చెల్లి సెరెనా గెలుపు

వింబుల్డన్ టోర్నీలో పాత చరిత్రే పునరావృతమైంది. అమెరికా టెన్నిస్ సిస్టర్స్ సెరెనా, వీనల్‌ల మధ్య మహిళల సింగిల్స్‌లో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో ఎప్పటిలానే అక్క వీనస్ విలియమ్స్‌పై చెల్లి సెరెనా విలియమ్స్‌దే పైచేయిగా నిలిచింది. 
 
ఆసక్తికరంగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ఏకపక్షంగానే ముగిసింది. ఆది నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించిన సెరెనా, వరుస సెట్లలో (6-4, 6-3) సెరెనాను చిత్తుగా ఓడించింది. వీరిద్దరి మధ్య ఇప్పటిదాకా 26 మ్యాచ్‌లు జరిగితే, సెరెనా 14 సార్లు గెలుపును నమోదు చేసుకుంది.