1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:51 IST)

#TelanganaElectionResults : కాంగ్రెస్ పార్టీకి కాక పుట్టిస్తున్న కేటీఆర్ ట్వీట్

తెలంగాణ తీర్పు మరి కొన్ని గంటల్లో తేలనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికారం మాదే అంటూ కాంగ్రెస్, మహా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సెంచరీ కొడతామంటూ అంతే ధీమాను వ్యక్తం చేస్తున్నారు తాజా మాజీ మంత్రి కేటీఆర్. ఇరు పార్టీల నేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం బయపడుతూనే ఉన్నారు. 
 
అయితే తాజాగా కేటీఆర్ చేసిన  ట్వీట్ తాజా రాజకీయాలను ఒక్కసారిగా వేడేక్కించాయి. 'తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించడానికి ఓ సరికొత్త పీఎం, ఆరుగురు ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి(కేసీఆర్) వీరందరిని ఎదుర్కొని నిలిచారు. రేపు కేసీఆర్‌గారు అద్భుతమైన విజయాన్ని అందుకోనున్నారు' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై మహాకూటమి నేతలు కాస్త గందరగోళంలో పడినట్టు సమాచారం.