బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (13:28 IST)

హైదరాబాద్ మెట్రోకు బాంబు బెదిరింపు.. ప్రయాణికుల పరుగోపరుగు

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగు పెట్టారు. గత నెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నే

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగు పెట్టారు. గత నెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నగరంలో అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. 
 
స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు హుటాహుటిన స్టేషన్‌ వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌ మెట్రోరైలును నవంబర్‌ 28న ప్రధాని మోడీ ప్రారంభించగా.. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తొలిరోజే ఏకంగా 2 లక్షల మంది ప్రయాణించడం ద్వారా మెట్రోరైలు రికార్డు సృష్టించింది.
 
ఈ నేపథ్యంలో అమీర్‌పేట్ మెట్రో  రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం అందరినీ టెన్షన్ పెట్టింది. స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులో బాంబు ఉన్నట్లు అనుమానించారు. జనం టెన్షన్ పడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. బ్యాగ్‌ను చెక్  చేసిన పోలీసులు.. అందులో ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఆ బ్యాగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుదిగా గుర్తించారు.