శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (19:19 IST)

తెరాసలోకి ఎర్రబెల్లి జంప్... మరో తెదేపా ఎమ్మెల్యే కూడా... తెలంగాణలో తెదేపా ఖాళీయేనా...?

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో గట్టి ఎదురుదెబ్బ తగులబోతోంది. సీనియర్ నాయకుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో సహా తెరాసలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం మంత్రి హరీశ్ రావుతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో తనతో పాటు మరో తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
 
గ్రేటర్ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లే నాయకుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఇటీవలే వివేకానంద గౌడ్ తెరాసలో చేరిపోయారు. తెలంగాణలో ప్రజలంతా తెరాసను కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల కోసం తను తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. వరుసగా ఎమ్మెల్యేలు, నాయకులు క్యూ కట్టడాన్ని చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.