శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:20 IST)

ఫోన్ ట్యాపింగ్‌తో తెలంగాణ గౌరవం మంటగలిసింది : ఎర్రబెల్లి దయాకర్

చట్ట వ్యతిరేకంగా టెలిఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంటగలిపారంటూ టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెరాస ప్రభుత్వ చర్యలతోనే నిరూపితమైందన్నారు. అందువల్ల దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, యావత్ తెలంగాణ గౌరవాన్ని మంటగలిపినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇప్పటికీ కూడా వివిధ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఒక రోజు నిరాహారదీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.