శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (14:07 IST)

ఎర్రబెల్లి తెరాసలోకి రాకుండా అడ్డుకుంది నేనే : కడియం శ్రీహరి

టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముమ్మరంగా కృషి చేశారనీ, అయితే, ఆయన తెరాసలో చేరకుండా తాను అడుడుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి టీఆర్ఎస్‌లోకి రావాలనుకున్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. కానీ ఆయన టీఆర్ఎస్‌లోకి రాకుండా అడ్డుకుంది తానేనని కడియం వెల్లడించారు. తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్‌లో ఎప్పటికీ స్థానం ఉండదని, పార్టీని విమర్శించే అర్హత కూడా ఎర్రబెల్లికి లేదన్నారు.
 
కాగా, గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరబోతున్నారంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అవన్నీ సద్దుమణిగాయి. ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఆయన తెరాసలో చేరకుండా అడ్డుకుంది తానేనని కడియం శ్రీహరి చెప్పడం మరో చర్చకు దారితీసేలా ఉంది.