ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 19 డిశెంబరు 2019 (22:06 IST)

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్‌డీకి సదస్సుకు గవర్నర్ హాజరు అయిన సందర్భంగా ఈ పరిణామం జరిగింది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో  శానిటేషన్, హైజీన్ కాంక్లేవ్ సదస్సులో ఆమె ప్రసంగించారు. 
 
అయితే గవర్నర్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాళం ఉంచి, తలుపులు మూసి బయటకు సిబ్బంది రావడంతో వాహనానికి ఆటోమెటిక్ లాక్ పడింది. ఈ కారణంగా కారు తలుపులు తీయడానికి రాలేదు. దీంతో డోర్ తీసేందుకు భద్రతా సిబ్బంది తంటాలు పడాల్సి వచ్చింది. సిబ్బంది వ్యవహరించిన తీరుపై గవర్నర్ భద్రతా సిబ్బంది మండిపడ్డారు.