శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (20:54 IST)

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్యే సీపీఆర్​వో రాకేశ్​ తెలిపారు. లోకో పైలెట్​ను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్​వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఎంఎంటీఎస్​ లోక్​ పైలెట్​ సిగ్నల్​ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు. లోకో పైలట్​ చంద్రశేఖర్​తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్​వో తెలిపారు.

బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.

ప్రమాదం వల్ల సికింద్రాబాద్​- ఫలక్​నుమా, కాచిగూడ-ఫలక్​నుమాకు వెళ్లాల్సిన ఎంఎంటీఎస్​ రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు ఫలక్​నుమా- జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్​ సిటీ, ఫలక్​నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశామని వివరించారు.

కాచిగూడ-గుంటూరు, ఫలక్​నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.