గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 22 జనవరి 2018 (20:31 IST)

మహిళా ఏఎస్పీ అధికారిణితో సీఐ రాసలీలలు... చెప్పుతో కొట్టారు, కేసు నమోదు

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణితో సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య వివాహేతర బంధం బట

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణితో సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య వివాహేతర బంధం బట్టబయలై, హైదరాబాద్, కేపీహెచ్‌బి కాలనీలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఏసీబీలో ఏఎస్పీగా పనిచేస్తున్న తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా అధికారిణి భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సీఐపై చెప్పులతో దాడి చేశారు. నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త ఇద్దరూ కలసి మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీవీ చానల్ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌ అయ్యారు. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పాడు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. కాగా సీఐ మల్లికార్జున్ రెడ్డిపై 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.