బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 10 నవంబరు 2018 (20:23 IST)

నైట్ పార్టీకి అమ్మాయిలను ఆహ్వానించిన నిత్యానంద... వాళ్లొచ్చేసరికి వీళ్లు పారిపోయారు...

కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది ఫూటుగా మద్యం తాగి, మగువలతో చిందేసారు. మున్సిపల్ కమిషనర్ నిత్యానంద గత పది రోజుల క్రిందట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపధ్యంలో మున్సిపల్ సిబ్బంది మంచి పార్టీ ఇచ్చాడు.. అమ్మాయిలను కూడా పార్టీకి ఆహ్వానించాడు. 
 
విషయం తెలుసుకున్న ఓ చానెల్ రిపోర్టర్, కెమెరామెన్ అక్కడకి వెళ్లగా అందరూ పారిపోయారు. అయితే కమిషనర్ నిత్యానంద మున్సిపల్ ఆఫీసులో మహిళ ఉద్యోగితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అయ్యింది. నీ కోసం చెవి రింగులు కొన్నానని కమిషనర్ నిత్యానంద  ఓ మహిళా ఉద్యోగికి ఆశ చూపినా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. నువ్వు చెవి రింగులు తీసుకోకపోతే నేను ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు కమిషనర్ నిత్యానంద. అదీ సంగతి.