శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (13:03 IST)

ఎన్నికలంటే.. కొన్ని పార్టీలకు గేమ్.. టీఆర్ఎస్‌కి మాత్రం టాస్క్- కేసీఆర్

ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక మేనిఫెస్టోను రూపొందించారు

ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఆసరా పెన్షన్లను రూ.2,016గా పెంచుతామని చెప్పారు. అంతేగాకుండా.. 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్‌ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పెన్షన్లు రూ.3,016 అందిస్తామన్నారు. 
 
ఇక నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామని చెప్పి, ప్రతిపక్షాల కంటే, ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామని చెప్పకనే చెప్పారు. సొంత స్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌లాంటిదని, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌ వంటిదన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెప్తామని తెలిపారు. 
 
కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింతగా బయటకు లాగుతామని చెప్పారు. చంద్రబాబు వచ్చి, ఆంధ్రా-తెలంగాణ గొడవలు పెడదామనుకుంటున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణలో ఉన్నవాళ్లంతా, తెలంగాణవారేనని చెప్పుకొచ్చారు.