శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2015 (16:01 IST)

చంద్రబాబు-కేసీఆర్ ఫోటోల వార్... ఇద్దరు ఫోటోలు పీకేశారు...

తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య ఎలాంటి గొడవలు ఇప్పటికైతే లైవు కానీ నాయకుల మధ్య మాత్రం ఈ గొడవలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాదులోని గురజాడ హాలులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఐతే అంతకుముందు ఆ హాలులో అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు గోడలకు వేలాడుతూ ఉన్నాయి. 
 
సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నేపధ్యంలో అటువైపు ఉన్న కేసీఆర్ ఫోటోను తీసేసి కిందపెట్టేశారు కొందరు అధికారులు. దీనిపై తెలంగాణ అధికార బృందం అభ్యంతరం పెట్టింది. వెంటనే ఫోటోను తగిలించాలని కోరింది. ఐతే అందుకు ఏపీ అధికారులు ఒప్పుకోకపోవడంతో వారు నేరుగా వెళ్లి గోడకు తగిలించి ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను తీసేసి కింద పెట్టేశారు. ఇలా ఎవరి ఫోటోను అక్కడ లేకుండా చేశారు. 
 
ఇంతలో ఏపీ సీఎం రావడం, మీడియా సమావేశంలో మాట్లాడటం, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. కానీ ఫోటోలను తగిలించేందుకు మాత్రం ఎవ్వరి గొడవ వాళ్లదే అన్నట్లుగా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం.