శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 25 అక్టోబరు 2014 (19:11 IST)

శ్రీశైలం కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమే... మంత్రి కేటీఆర్ వ్యాఖ్య

శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమేనని తెలంగాణ మంత్రి కెటీఆర్ అన్నారు. ప్రాజెక్టులో 834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని జీవోలో ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1996 సంవత్సరంలో జీవో నెం. 69 విడుదల చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. అవసరమైతే దేవినేనికి జీవో కాపీ పంపిస్తామని కేటీఆర్ తెలిపారు.
 
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 69,107 జీవోలు అర్ధం కాలేదని, అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆ రెండు జీవోలు పాటిస్తామని రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డు వద్ద ఒప్పుకున్నాయని పరకాల తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన మాటలను మీరుతున్నారని, విపరీత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. 
 
కేసీఆర్ మాటలు మీరుతున్నారని హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేవలం తెలుగు ప్రజలను తప్పుదోవపట్టించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమే సవాళ్లు అని ఆయన స్పష్టం చేశారు.