శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (11:25 IST)

మెదక్ లోక్‌సభ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా కోదండరాం?

మెదక్ లోక్‌సభ‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఈ ఆలోచన కోదండరాంకి వుందోలేదో గానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నేతల బుర్రలకి వచ్చింది. దీంతో అధిష్టానం దృష్టిలో చేరవేయగా, కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్‌సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఈ ప్రతిపాదన వచ్చింది. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రతిపాదించగా, దీనిపై ఆలోచన చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్‌ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు.