శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:17 IST)

వరదలొస్తే తెలంగాణ వెంకయ్యకు గుర్తే రాదు.. ఓన్లీ ఏపీనే గుర్తుంటుంది: కవిత

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. ఏపీకి ఎంత వరద సాయం చేస్తారో తెలంగాణకూ అంతే సాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. విమోచనం అన్నప్పుడే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుందని, వరదలు వచ్

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. ఏపీకి ఎంత వరద సాయం చేస్తారో తెలంగాణకూ అంతే సాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. విమోచనం అన్నప్పుడే వెంకయ్యకు తెలంగాణ గుర్తుకొస్తుందని, వరదలు వచ్చినప్పుడు వెంకయ్యకు ఏపీనే గుర్తుకు వస్తుందన్నారు. తెలంగాణలో వరదలొచ్చినా వెంకయ్య వరద బాధితులపై నోరెత్తకపోవడం దారుణమన్నారు. 
 
తెలంగాణ జాగృతి తరుపున బతుకమ్మ పాటలకు సంభందించిన యాప్‌ను విడుదల చేసిన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వరదల సమయంలో ఏపీలో విహంగ వీక్షణం చేసిన వెంకయ్య తెలంగాణను మాత్రం మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ నెల 30 నుంచి బతుకమ్మ సంబురాలను ప్రారంభిస్తామన్నారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. 
 
వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుందామన్నారు. ఇకపోతే.. మిడ్ మానేరుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.