శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (16:04 IST)

ముజ్రా పార్టీ ఎఫెక్ట్ : 9 మంది జీహెచ్‌ఎంసీ అధికారుల సస్పెన్షన్‌

ముజ్రా (రేవ్) పార్టీలో అనైతిక చర్యలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన 9 మంది జీహెచ్‌ఎంసీ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేస్తూనే... ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు సంజయ్‌కుమార్‌, పద్మభూషణ్‌రాజు, రవీంద్రుడు, బిల్‌ కలెక్టర్లు కృష్ణ, నరహరి, జ్ఞానేశ్వర్‌, రణవీర్‌, భూపాల్‌, బాబూరావులు ఉన్నారు. 
 
కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌ నగర శివారు ఖానామెట్‌లో ఓ ప్రైవేట్ భవనంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు దాడిచేసి 10 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో పాటు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఈ భవనంపై దాడి చేసి జీహెచ్ఎంసీ అధికారులను అరెస్టు చేసింది.