శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (12:15 IST)

మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గుణపాఠం : పొన్నాల

మెదక్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు గుణపాఠం చెపుతారని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తోంది. 
 
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పక ఆదరిస్తారని, అధికారంలో ఉన్న పార్టీకి గుణపాఠం చెప్పేలా ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ మెదక్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలసి హైదరాబాదులో తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, తనను మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్టానానికి సునీత కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నారు.