శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (10:38 IST)

రేవంత్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలి : నేడు సుప్రీంకోర్టులో ఏసీబీ పిటీషన్?

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైదరాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలుచేయనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ముఖ్యంగా.. నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులపై పరుష పదజాలంతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీసం మెలేశారు.
 
రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఆడియో కాపీలతో పాటు మీసం మెలేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించిన వీడియో సీడీలతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ వీడియోలను సాక్ష్యంగా చూపించి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.