శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (15:15 IST)

సండ్ర అరెస్టు సక్రమమే : 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!

ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టు సక్రమమేనంటూ తెలంగాణ ఏసీబీ కోర్టు తేల్చి.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను హైదరాబాద్ చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన ప్రజాప్రతినిధి అయినందువల్ల ప్రత్యేక ఖైదీగా చూడాలని జైలు అధికారులను ఆదేశించారు. 
 
మరోవైపు, సండ్రను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ చేసిన వినతికి... కౌంటర్ దాఖలు చేయాలని సండ్ర తరపు లాయర్లకు కోర్టు సూచించింది. దీంతో, సండ్ర తరపు లాయర్లు కౌంటర్ దాఖలుచేశారు. మరోవైపు, బెయిల్ కోసం సండ్ర తరపు లాయర్లు పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ జరుగనుంది.