శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: గురువారం, 17 జులై 2014 (17:14 IST)

మద్యం కోసం పీడించిన తండ్రి... గొంతు నొక్కి హత్య చేసిన కొడుకు

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రినే కడతేర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జడ్చర్లలో నివాసం ఉంటున్న యాదయ్య మద్యానికి బానిసై నిత్యం డబ్బులు కోసం కొడుకునే వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కొడుకు వెంకటేష్‌ను డబ్బులు అడగగా ఇద్దరి మద్య వాగ్వివాదం జరగడంతో వెంకటేష్ తన తండ్రి యాదయ్య గొంతు నుమిలి హత్య చేసాడు. 
 
రాత్రి అంతా తండ్రి శవం దగ్గిరే గడిపిన వెంకటేష్  తెల్లవారు జామున తన తండ్రి చనిపోయాడంటూ చుట్టుపక్కల వారిని పిలిచి ఏడవడం మొదలుపెట్టాడు. అయితే వెంకటేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్థులు  నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకుని భోరుమన్నాడు. ఆవేశంలో నాన్నను చంపేశాను అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెంకటేష్ కోసం గాలిస్తున్నారు.