శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (15:24 IST)

నేను విచారణకు సిద్ధం.. ఎపుడు రమ్మంటారు : టీ ఏసీబీకి సండ్ర లేఖ

తెలంగాణ రాష్ట్రానికి చెంది టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు ఓ లేఖ రాశారు. ఓటుకు నోటు కేసులో తాను విచారణకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందువల్ల విచారణకు ఎపుడు రమ్మంటే అపుడు వస్తానంటూ అందులో పేర్కొన్నారు. వెన్ను, కాలునొప్పి కారణంగా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందానని సండ్ర వెల్లడిస్తూ.. గత వారంపదిరోజులుగా తాను ఎక్కడున్నానో బహిర్గతం చేశారు. 
 
గతంలో ఓటుకు నోటు కేసులో సండ్రను విచారించేందుకు గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని ఏసీబీకి తొలిసారి లేఖ రాసిన విషయంతెల్సిందే. కొన్ని రోజుల కిందటే ఏసీబీ ఇచ్చిన గడువు కూడా ముగియడంతో మరోసారి సండ్రకు టి.ఏసీబీ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే, టీ ఏసీబీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. సండ్ర వెంకటవీరయ్యే స్వయంగా టీ ఏసీబీకి లేఖ రాశారు.