శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By CVR
Last Updated : గురువారం, 21 మే 2015 (15:09 IST)

తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగో... మహేందర్ రెడ్డి ఆవిష్కరణ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా సంస్థ (ఆర్టీసీ) కొత్త లోగోను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్న ఈ లోగోను జ్ఞానేశ్వర్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ లోగో గుండ్రటి ఫ్రేమ్‌లో కాకతీయుల కళాతోరణం, దాని మధ్య చార్మినార్‌ను ఉంచారు. వాటి కింద 'ప్రగతి రథం, ప్రజల నేస్తం' అనే రాశారు. ఫ్రేమ్ చుట్టూ పసుపు, ఆకుపచ్చ రంగులతో రింగులు రూపొందించారు. 
 
ఈ సందర్భంగా లోగో గురించి జ్ఞానేశ్వర్ వివరిస్తూ, పసుపు రంగు సీఎం కేసీఆర్ కలలు కంటోన్న బంగారు తెలంగాణను ప్రతిబింబిస్తుందని చెప్పారు. 'గ్రీన్ తెలంగాణ' అంటోన్న సీఎం ఆశయానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగు నిలుస్తుందని వివరించారు. ఈ కొత్త లోగోతోనే గురువారం బస్సులు తిరగనున్నాయి.