శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (11:40 IST)

కాకతీయ బడి బస్సు ప్రమాదం మృతులు 16 మంది!

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ విద్యామందిర్‌కు చెందిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందినట్టు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నట్టు తెలిపింది. 
 
కాకతీయ పాఠశాలకు చెందిన బస్సు గురువారం ఉదయం రైల్వే గేటు దాటుతుండగా నాందేడ్ ప్యాపింజర్ ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 16 మంది మరణించగా, 20 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి రాజయ్య తదితరులు పరామర్శించారు.