5 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ల నియామకం : ఏఐసీసీ
తెలంగాణ రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు.
అలాగే, మహారాష్ట్రకు అశోక్ చవాన్, గుజరాత్కు భరత్ సిన్హా సోలంకి, ఢిల్లీకి అజయ్ మాకెన్, జమ్మూ కాశ్మీర్కు గులామ్ అహ్మద్ మీర్ పేర్లను ఏఐసీసీ ఎంపిక చేసింది. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మయ్య ఉండగా, ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను తప్పించింది.