శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 22 మే 2018 (21:26 IST)

టాప్ స్టార్‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న పూరి..!

ఆకాష్ పూరితో మెహబూబా చిత్రాన్ని తెర‌కెక్కించిన పూరికి నిరాశే ఎదురైంది. అయితే... పూరికి ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. అందుచేత‌ ఆకాష్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే... ఈమధ్యలో ఓ స్టార్‌ హీరోకు కథను వినిపించి ప్రాజెక్

ఆకాష్ పూరితో మెహబూబా చిత్రాన్ని తెర‌కెక్కించిన పూరికి నిరాశే ఎదురైంది. అయితే... పూరికి ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. అందుచేత‌ ఆకాష్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే... ఈమధ్యలో ఓ స్టార్‌ హీరోకు కథను వినిపించి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నాడని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంత‌కీ.. ఎవ‌రా టాప్ హీరో అనుకుంటున్నారా..? టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. మెహబూబా చిత్ర విడుదలకు ముందే నాగార్జునకి పూరి ఓ కథను వినిపించారట. ఎమోషనల్‌ కంటెంట్‌తో ఉన్న ఆ కథ నచ్చటంతో నాగ్‌ ఓకే చేశాడని, పైగా నాగ చైతన్యతో అది మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నాడని ఆ కథనం సారాంశం.
 
మెహబూబా ఫలితంతో సంబంధం లేకుండా మరీ ఆ ప్రాజెక్టును నాగ్‌ కమిట్‌ అయినట్లు ఆ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే... నానితో చేస్తున్న మల్టీస్టారర్‌, బంగార్రాజు ప్రాజెక్టు పూర్తయ్యాక పూరితో మల్టీస్టారర్‌ ప్రారంభిస్తారట‌. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది. గతంలో నాగ్ - పూరి కాంబోలో శివమణి, సూపర్‌ చిత్రాలు వచ్చాయి. దాదాపు దశాబ్దంకు పైగా గ్యాప్‌ తర్వాత వీళ్లు మళ్లీ క‌లిసి సినిమా చేస్తుండ‌డం విశేషం.