శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (14:26 IST)

టాలీవుడ్ ముదురు హీరోకి మలయాళీ భామ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతా

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార ఇలా చాలా మందే ఉన్నారు. దీంతో వెంకీ సరసన నటించే హీరోయిన్ కరువైంది. 
 
ఈ నేపథ్యంలో ముదురు హీరో సరసన నటించేందుకు ఓ మలయాళీ భామను ఫిక్స్ చేశారట. 'గురు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్టరీ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ మూవీకి ప్లాన్ చేశాడు. ఇందులో కథానాయికగా కాజల్‌ లేదా తమన్నాను అనుకున్నప్పటికి పలు కారణాల వలన మలయాళ కుట్టీ నిత్యామీనన్‌ని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది. 
 
ఈ మధ్య అంతగా సినిమాలు లేని నిత్యా.. వెంకీతో సినిమాకి సై అందట. మరి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "ఆడవాళ్లూ మీకు జోహార్లు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం.