మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:35 IST)

నా బట్టల గురించి మీకెందుకు..టాప్ యాంకర్ ఫైర్

తాజాగా జరిగిన పుల్వామా ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విధంగానే యాంకర్ అనసూయ పెట్టిన పోస్ట్‌కు సంబంధం లేకుండా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో బాధపడిన అనసూయ నెటిజన్లకు గట్టిగానే సమాధానం ఇచ్చింది. 
 
నేను పెట్టిన పోస్టుకు సంబంధం లేకుండా, నేను ఎందుకు పెట్టానో కూడా తెలుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను శాంతి గురించేమీ మాట్లాడలేదు. నాకు కూడా ఈ ఘటనపై చాలా కోపం వచ్చింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఎవరినీ రెచ్చగొట్టకూడదు. యుద్ధం చేయాల్సిందే అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ మాట చెప్పేవారు ఎవరైనా అక్కడికి వెళ్లి యుద్ధం చేస్తారా? కనీసం అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఊపిరి తీసుకోవడానికే కష్టపడే పరిస్థితులు ఉంటాయి.
 
జరిగింది ఘోరమైన ఘటనే, కాదనను, అందుకని మనం కూడా అదే చేస్తే ఎంత వరకు సమంజసం అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. కొంత మంది అయితే నీకెందుకుమ్మా ఇవన్నీ, పిక్స్ పోస్ట్ చేసుకో, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పని చూసుకో అంటూ అసహ్యంగా కామెంట్స్ పెట్టారు. ఇలా జరిగిందని మీరేమైనా తినడం, పడుకోవడం మానేస్తున్నారా? లేదా అందరూ పోరాడటానికి కాశ్మీర్ వెళ్లిపోతున్నారా? అంటూ ప్రశ్నించారు.
 
చేస్తే మంచి చేయండి. అంతేగానీ, నువ్వు బట్టలు సరిగ్గా వేసుకో.. అసలేంటీ కామెంట్స్? నేను ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండీ? ప్రతిసారి ఎందుకు నా బట్టల మీదకే వస్తారు? మీ బుద్ది ఇంతేనా, ఇక మారరా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు.