శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (16:47 IST)

ఏందివ‌య్యా.. దిమాక్‌ ఖరాబైందా? అనసూయ మండిపాటు

సోషల్ మీడియా నెటిజన్లపై బుల్లితెర పాపులర్ యాంకర్, నటి అనసూయ మరోమారు ఫైర్ అయింది. 'ఏందివయ్యా.. దిమాక్ ఖరాబైందా?' అంటూ మాటలదాడి చేశారు. నేను 'జబర్దస్త్' అంటే మీరు 'అర్జున్ రెడ్డి' అంటారేంటి ఆగ్రహం వ్యక్

సోషల్ మీడియా నెటిజన్లపై బుల్లితెర పాపులర్ యాంకర్, నటి అనసూయ మరోమారు ఫైర్ అయింది. 'ఏందివయ్యా.. దిమాక్ ఖరాబైందా?' అంటూ మాటలదాడి చేశారు. నేను 'జబర్దస్త్' అంటే మీరు 'అర్జున్ రెడ్డి' అంటారేంటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత 'క్ష‌మించండి.. ఏమ‌నుకోవ‌ద్దు..' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది. ఈ వివాదంపై ఆమె చేసిన ట్వీట్లను పరిశీలిస్తే,
 
ఈటీవీలో ప్రసారమయ్యే 'జ‌బ‌ర్ద‌స్త్'ను స‌పోర్ట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో అనసూయ మాట్లాడారు. 'జ‌బ‌ర్ద‌స్త్' ఓ "బాహుబ‌లి"లాంటిద‌ని, ఆ కార్య‌క్ర‌మాన్ని విమర్శించి క్రియేటివిటీని కించ‌ప‌ర‌చ‌వ‌ద్ద‌ని ఫేస్‌బుక్ లైవ్‌చాట్‌లో అన‌సూయ వ్యాఖ్యానించారు.
 
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెపై మాటలదాడి చేశారు. గ‌తంలో 'అర్జున్‌ రెడ్డి' విషయంలో చేసిన వ్యాఖ్య‌లను ప్రస్తావించారు. 'అర్జున్‌ రెడ్డి'ని అంతలా విమ‌ర్శించిన‌పుడు క్రియేటివిటీ గుర్తుకురాలేదా? అంటూ ప్రశ్నలు ఎక్కుపెట్టారు. 
 
దీంతో అనసూయ కూడా తన ట్విట్టర్ ఖాతాలో నెటిజన్లకు కౌంటర్ ఇచ్చారు. "అరే.. నేను అస‌భ్య‌క‌ర‌మైన డైలాగ్‌ల గురించి మాట్లాడితే బ‌ట్ట‌లు స‌రిగా వేసుకోమంటారు. నేను ఫ‌న్‌ని ఫ‌న్‌లా తీసుకోండంటే.. 'అర్జున్ రెడ్డి' అంటారు. ఏందివ‌య్యా.. దిమాక్‌లో అటుది ఇటు.. ఇటుది అటు అయిందా' అని ట్వీట్ చేసింది. 
 
ఆ తర్వాత 'క్ష‌మించండి.. ఏమ‌నుకోవ‌ద్దు.. వితండ‌వాదాలు చేసేవాళ్ల‌ని, ఊరికే గెలుకుదాం అనుకునేవాళ్ల‌ని, నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లని బ్లాక్ చేద్దామ‌ని డిసైడ్ అయ్యా. నా ఆనందం నా చేతుల్లో ఉన్న‌ట్టు.. మీరు కూడా మీకు ఏది న‌చ్చితే అది చెయ్యండి. నిజాయితీగా, ఆనందంగా ఉండే వ్య‌క్తులే నా చుట్టూ ఉండాల‌ని కోరుకుంటా" అంటూ అనసూయ ట్వీట్ చేశారు.