శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 18 జూన్ 2018 (15:22 IST)

మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి న‌మ్ర‌త ఏమ‌న్నారో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు త‌న కెరీర్‌లో ముఖ్య‌మైన 25వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు త‌న కెరీర్‌లో ముఖ్య‌మైన 25వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... గ‌త కొన్ని రోజులుగా మ‌హేష్ బాబు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈ వార్త‌లపై మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... మ‌హేష్ త‌న‌ 25వ సినిమా లుక్‌ టెస్ట్‌ కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీంను కలవడానికే ముంబైలో ఉండాల్సి వచ్చింది. అంతేకానీ... ఏ బాలీవుడ్‌ నిర్మాతను కలవలేదని ఆమె వెల్లడించారు. అదీ..సంగ‌తి. ఇక 25వ సినిమా విష‌యానికి వ‌స్తే... ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రం షూటింగ్ ఈరోజే ప్రారంభించారు.