శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (17:06 IST)

రేణూకు నిశ్చితార్థం : అకీరా - ఆద్యలతో రుషికొండకెళ్లిన పవన్

తన మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో తన ఇద్దరు బిడ్డలను మాజీ భర్త పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారు ఈ బిడ్డలను తీసుకుని పవన్ కళ్యాణ్ రుషికొండలోని సాయి రిసార్ట్స్‌కు వెళ్లారు.

తన మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో తన ఇద్దరు బిడ్డలను మాజీ భర్త పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారు ఈ బిడ్డలను తీసుకుని పవన్ కళ్యాణ్ రుషికొండలోని సాయి రిసార్ట్స్‌కు వెళ్లారు.
 
పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితానికి గుర్తుగా అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టిన విషయం తెల్సిందే. గత పదేళ్లుగా వీరిద్దరూ పూణెలోని రేణూ వద్దే ఉంటూ వచ్చారు. అయితే, రేణూ దేశాయ్ మరో వ్యక్తిని వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ నిశ్చితార్థం కూడా సోమవారం జరిగింది. 
 
దీంతో అకీరా, ఆద్యలను పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారు. ఈ ఇద్దరిని తీసుకుని పవన్‌ కళ్యాణ్‌ సోమవారం విశాఖపట్నం వచ్చారు. ఈ నెల 26 నుంచి విశాఖపట్నంలో పోరాట యాత్ర చేయనున్నట్టు నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. జిల్లాలో పోరాట యాత్రకు రంజాన్‌ కారణంగా మధ్యలో విరామం ప్రకటించారు. 
 
ఈ సమయంలోనే ఆయన కంటికి సంబంధించిన చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నారు. వైద్యులు దానికి ఇంకా సమయం వుందని చెప్పడంతో విశాఖలో మలి విడత యాత్రకు సన్నద్ధమయ్యారు. గతంలో ఒంటరిగా వచ్చిన పవన్‌కల్యాణ్‌ ఈసారి తన కుమారుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్యతో వచ్చి.. రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో బస చేశారు. ఇకపై అకీరా, ఆద్యలు పవన్ వద్దే ఉండేలా కనిపిస్తున్నారు.