శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (10:43 IST)

పూరి మెహ‌బూబా ట్రైల‌ర్ రిలీజ్.. ఛార్మి షాకింగ్ రియాక్ష‌న్..? (Trailer)

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందించిన చిత్రం "మెహబూబా". 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందించిన చిత్రం "మెహబూబా". 1971లో జరిగిన ఇండో-పాక్  యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌కు .. టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ ద్వారా పూరి సింపుల్‌గా కథ చెప్పేశాడు. ఇది ఒక సైనికుడి ప్రేమకథగా, యుద్ధం.. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక్క సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు. అసలు ఈ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది. మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.
 
ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించింది. దీంతో పూరి కనెక్ట్స్ వ్యవహారాలు చూసుకునే నటి చార్మి స్పందించింది. రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ వచ్చిన విషయాన్ని పోస్టర్‌పై రాసి మాటల్లేవ్.. ఆనంద భాష్పాలే అని ట్వీట్ చేసింది.
 
ఈ సినిమాపై పూరి చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఎందుకంటే.. ఇది త‌న‌యుడు ఆకాష్ లైఫ్‍కి సంబంధించింది కాబ‌ట్టి. మే 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మ‌రి.. ఈ సినిమా విజ‌యం సాధించి పూరికి పూర్వ వైభ‌వాన్ని తెస్తుంద‌ని ఆశిద్దాం.