శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:44 IST)

జీసస్ క్రైస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు.. కేఏ పాల్‌ను? వర్మ

వివాదాలు కొనితెచ్చుకోవడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుంటాడు. ప్రస్తుతం వర్మ దృష్టి కేఏ పాల్‌పై పడింది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై ట్విట్టర్లో వర్మ చేసిన తాజా కామెంట్స్ ప్రస్తుతం సంచలనానికి దారితీసింది. ప్రజా శాంతి వ్యవస్థాపకుడైన కేఏ పాల్‌ను శిలువ వేయబోతున్నానని జీసస్ క్రైస్ట్ తనకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడంటూ ట్వీట్ చేశాడు. 
 
గత కొన్నేళ్ల పాటు ఆర్జీవీ, కేఏపాల్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. మోదీ, చంద్రబాబు లాంటి చిన్న నేతలపై పోటీ చేసేకంటే.. జీసస్‌ను ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి కేఏ పాల్ అధ్యక్షుడిగా మారవచ్చుగా అంటూ వర్మ సెటైర్లు వేశాడు. ఇందుకు సమాధానంగా ముంబైలోని ఓ హోటళ్లో వర్మ తన పాదాలకు పాదాభివందనం చేసినట్లు పాల్ కామెంట్స్ చేశాడు. 
 
దీనికి కౌంటర్‌గా.. వర్మ తీసిపోని సమాధానం ఇచ్చారు. ఓ ప్రభువా తాను పాల్ కాళ్లను ముట్టుకోలేదని.. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగానన్నాడు. తల నేలకు కొట్టుకుంటే బుర్ర సెట్ అవుతుందని.. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదలేశానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం కేఏ పాల్, వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవడమే గాకుండా బాగా ట్రెండ్ అవుతున్నాయి.