శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (13:28 IST)

చెన్నై సముద్రంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం?

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామే

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామేశ్వరంలో శనివారం కలిపినట్టు వార్తలు వచ్చాయి. 
 
దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అస్థికలను రామేశ్వరం తీరంలో ఉన్న బంగాళాఖాతంలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలచుకుని విలపించారు. 
 
అయితే, ఈ వార్తలను అనేక మంది కొట్టిపారేస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వచ్చిన బోనీ కపూర్ కుటుంబం.. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న శ్రీదేవికి సొంతమైన ఫామ్‌హౌస్‌లో బసచేశారు. 
 
ఈ ఇంటి వెనుక భాగంలో ఉన్న బంగాళా ఖాతంలోనే ఈ అస్థికలను నిమజ్జనం చేశారని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే. వారు నిమజ్జనం చేసిన సమయంలో తీసిన ఫోటో రామేశ్వరంలో తీసినది కాదనీ, శ్రీదేవి నివాసం వెనుకభాగంలో ఉన్న సముద్రం వద్ద తీసిందనే ప్రచారం సాగుతోంది.