శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (18:31 IST)

అమ్మ కొడుతుందని పవన్ కళ్యాణ్ అలా చేశారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ గుబురు గెడ్డం పెంచుకుని ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఐతే అకస్మాత్తుగా ఆ గెడ్డం తీసేసి ట్రిమ్‌గా మారిపోయారు.
 
ఇలా ఆయన ఎందుకు మారారయా అనే చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఇలా చెప్పేస్తున్నారు. ఏ పిల్లవాడైనా అమ్మ ముందు చాలా నీట్‌గా వుండాలని ప్రయత్నిస్తాడు. శుభ్రంగా లేకపోతే అమ్మ కొడుతుందని భయం. 
 
అర్థమైంది కదా... తాజా పవన్ కల్యామ్ మాతృమూర్తి అంజనాదేవి పార్టీకి రూ. 4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ చెక్కును ఇచ్చేందుకు అమ్మ వస్తుందని తెలిసి పవన్ కళ్యాణ్ గబగబా గెడ్డాన్ని తీసేసి నీట్‌గా మారిపోయారు. అదండీ సంగతి.