మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (10:28 IST)

బీజేపీకి చెక్.. కరీనాను రంగంలోకి దించనున్న హస్తం పార్టీ

బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్లాన్ చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. 
 
బీజేపీకి కంచుకోటగా వున్న భోపాల్‌ను దక్కించుకోవాలంటే కరీనా లాంటి సెలబ్రిటీకి పోటీకి దించకతప్పదని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ పార్టీ హైకమాండ్‌కు వివరించినట్లు సమాచారం. అభిమానగణంతో పాటు భర్త సైఫ్ అలీఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్‌గా పనిచేశారు. నవాబ్ కాలం నుంచి ఆయనకు మంచి పేరుండటంతో.. సైఫ్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు మంచి పేరు లభిస్తుందని టాక్. 
 
ఇంకా అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్‌కు విజయం తథ్యమని నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనే గట్టి నేతలు ఎవ్వరూ లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కరీనాను పోటీకి దించాలని చూస్తున్నారని కమలనాథులు విమర్శించారు.