బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (13:08 IST)

కుక్కను రాళ్ళతో కొట్టాడనీ వ్యక్తిని కాల్చి చంపిన యజమాని.. ఎక్కడ?

కొందరు క్షణికావేశంలో క్షమించరాని చర్యలకు పాల్లడుతున్నారు. తమ కుక్కను రాళ్ళతో కొట్టాడన్న కోపంతో ఓ వ్యక్తిని ఇంటి యజమాని తుపాకీతో తాల్చి చంపాడు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీకి చెందిన అఫాక్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అపుడు ఓ కుక్క మొరుగుతూ అతన్ని కరిచేందుకు వచ్చింది. దీంతో రాయి తీసుకుని కుక్కను కొట్టాడు. దీన్ని గమనించిన కుక్క యజమాని... గబగబా ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకుని అఫాక్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. 
 
వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత తుపాకీతో అపాక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అఫాక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చనిపోయాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఇంటి యజమానికి కోసం గాలిస్తున్నారు.