శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (13:11 IST)

ఓటర్లను ఫూల్ చేయడానికే సీఎం బాబు నాటకం... జర్నలిస్ట్ గోస్వామి... నెటిజన్లు ఏమంటున్నారంటే?

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో జరుగుతున్న ఆందోళన తెలిసిందే. కొద్దిసేపటి క్రితం సభ్యుల నినాదాలతో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో జరుగుతున్న ఆందోళన తెలిసిందే. కొద్దిసేపటి క్రితం సభ్యుల నినాదాలతో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తమకు అందిందని లోక్ సభ స్పీకర్ తెలియజేశారు. ఐతే సభ అదుపులో లేనందున దానిపై చర్చ చేపట్టే అవకాశం లేదని వెల్లడించారు. 
 
ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పడం అంతా చీప్ పోలిటిక్స్ అంటూ ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి ట్విట్టర్లో ప్రస్తావించారు. ఓటర్లను ఫూల్స్ చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నారంటూ విమర్శించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ చేస్తే ఏం చేస్తారూ అంటూ ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
 
రాష్ట్రాన్ని విభజించేటపుడు కేంద్రానికి ఈ విషయం తెలియదా... ఒకవేళ ఇలాంటిది జరుగుతుందని తెలిసినప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు విభజించారు అంటూ ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పారు...? అని ప్రశ్నిస్తూనే... నువ్వేమైనా భాజపా పెయిడ్ జర్నలిస్టువా అంటూ ప్రశ్నించారు. మొత్తమ్మీద అర్నాబ్ గోస్వామి చేసిన ట్వీట్ పైన నెటిజన్లు మండిపడుతున్నారు.