శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:36 IST)

చంద్రబాబు ప్రణమిల్లింది పార్లమెంట్‌కు కాదు... ప్రధాని నరేంద్ర మోడీకి

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ హాలులో అడుగుపెట్టే ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్లకు తాకుతూ నమస్కరించారు.
 
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన రాఫెల్ డీల్ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేంత పెద్దోళ్లం కాదని, కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగిన శాండ్, ల్యాండ్ స్కాం గురించి మాట్లాడతామన్నారు.