శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (17:13 IST)

పోసానిది అనవసర రాద్ధాంతం.. నందికి కులాలా?: వైసీపీ నేత

నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి నంది అవార్డులపై ఎలాంటి వివాదం లేదని.. అవార్డుల్లో కులాలకు స్థానం లేదని వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అన్నారు. నంది అవార్డులపై స్పందించిన ఆయన.. న

నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి నంది అవార్డులపై ఎలాంటి వివాదం లేదని.. అవార్డుల్లో కులాలకు స్థానం లేదని వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అన్నారు. నంది అవార్డులపై స్పందించిన ఆయన.. నంది అవార్డులు రానివారు రచ్చ చేయడం మామూలేనని.. ఒక్కసారి అవార్డులను ప్రకటించిన తర్వాత.. వాటిని వెనక్కి తీసుకోవడం ఉండదన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అవార్డులపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అవార్డుల్లో కులాలకు స్థానం వుండదన్నారు. 
 
కాగా.. నంది అవార్డుల విమర్శలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించినట్టు వార్తలొచ్చాయి. ఏపీలో ఆధార్ కార్డు లేని వారు మాట్లాడుతున్నారని, వారంతా ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్ర అని లోకేశ్ వ్యాఖ్యనించినట్టు ఓ వార్తా సంస్థ ప్రచురించింది. లోకేష్ వ్యాఖ్యలపై సినీ నటుడు, రచయత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
తాను నంది అవార్డును స్వీకరిస్తే 'కమ్మోడివి కాబట్టే అవార్డు వచ్చిందా' అంటారని... అందుకే అవార్డును తిరస్కరిస్తున్నానని పోసాని వ్యాఖ్యానించారు. ఇంక నంది అవార్డులను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.